- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
మండలంలోని జూపల్లి గ్రామంలో అంకిళ్ళ పరుశరాములు అనే వ్యక్తి అనారోగ్యంతో గత వారం రోజుల క్రితం మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలాది బాలరాజు మృతుడి కుటుంబాన్ని పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి తెలుసుకొని 5వేల ఆర్థిక సహాయం చేశారు. బాలరాజు వెంట మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశాంత్, ప్రజలు తదితరులు ఉన్నారు.
- Advertisement -