- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
ఈ నెల 9, 10 వ తేదీలలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డి ఎస్ ఏ క్రీడా మైదానంలో నిర్వహించే 7వ రాష్ట్ర స్థాయి నెట్ బాల్ క్రీడా పోటీలకు మంచిర్యాల జిల్లా తరఫున ఆడటానికి స్లేట్ పాఠశాలకు చెందిన భాను చరణ్, అరవింద్, తేజశ్విన్ లు ఎంపికయ్యారు. ఎంపిక అయిన విద్యార్థులను స్లేట్ విద్యా సంస్థల చైర్మన్ ఏనుగు శ్రీకాంత్ రెడ్డి , డైరెక్ట్రస్ ఏనుగు రజిత రెడ్డి, ప్రిన్సిపాల్ షిరీన్ ఖాన్, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సంతోష్, నాగేష్, జ్యోష్ణ మరియు ఉపాధ్యాయుల బృందం అభినందనలు తెలియజేశారు.
- Advertisement -