- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: మెడికల్, భౌతిక, రసాయన శాస్త్రల్లో విస్తృత పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలకు నోబెల్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. మూడు రంగాల్లో నూతన ఆవిష్కరణలకు కృషి చేసిన ముగ్గురు చొప్పన ఆయా రంగాల్లో నోబెల్ అవార్డు ప్రకటించారు. . శుక్రవారం శాంతి బహుమతి, అక్టోబర్ 13న అర్థశాస్త్రంలో ఈ పురస్కారం అందుకోనున్న వారి పేర్లను ప్రకటిస్తారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి డిసెంబర్ 10న గ్రహీతలకు అవార్డులను అందజేస్తారు.తాజాగా 2025 సంవత్సరానికి గానూ సాహిత్యంలో నోబెల్ బహుమతిని గురువారం ప్రకటించారు. హంగేరియన్ రచయిత క్రాస్జ్నాహోర్కైను ఈ ఏడాది సాహిత్య నోబెల్ వరించింది.
- Advertisement -