- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలంలోని మురిమడుగు నిరుపేద కుటుంబానికి చెందిన జంబర్తి లింగన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. గురువారం జరిగిన దశదిన కర్మ సందర్భంగా అతని మిత్రులు చందాలు పోగు చేసి రూ.18,000 ఆ కుటుంబానికి అందించారు. మిత్రులు దుర్గం, వంశీ, శ్రీనివాస్, లక్ష్మణ్ ఈ మొత్తాన్ని అందజేశారు. దాతలు ముందుకు వచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.
- Advertisement -