- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ హాస్టల్లో ముగ్గురు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. పదో తరగతి చదువుతున్న ఇద్దరు, 9వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని కనిపించకుండా పోయారు. చిట్టీల్లో కొన్ని ప్రాంతాల పేర్లు రాసి, లక్కీ డ్రా తీసి, అందులో వచ్చిన ప్రాంతాలకు వెళ్తున్నట్లు స్నేహితులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఉదయం 5 గంటలకు హాస్టల్ నుంచి వెళ్లిపోయినట్లు హాస్టల్ సిబ్బంది పోలీసులకు తెలిపారు. విద్యార్థుల సమాచారం మేరకు పోలీసులు అదృశ్యమైన బాలికల కోసం గాలిస్తున్నారు.
- Advertisement -