- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం లో గడిచిన రెండు సంవత్సరాల కాలంలో వివిధ పథకాల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రజలకు బాకీపడ్డ డబ్బుల గురించి ప్రజలకు తెలిపాలని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు ఓట్లు అడగడానికి ఇంటికి వస్తే బాకీ కార్డులు చూపి ప్రజలు ప్రశ్నించాలని ఈ సందర్బంగా పిలుపునిచ్చారు. బాకీ కార్డులను నాయకులకు, కార్యకర్తలకు అందజేసి డివిజన్లలో ప్రతీ ఇంటికి చేరే విధంగా నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పంపిణీ చేయాలన్నారు.
- Advertisement -