– తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారుల బృందం టీం లీడర్ ఆస రామారావు..
నవతెలంగాణ -రాయపోల్
వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని ముఖ్యంగా యువత ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల బృందం టీమ్ లీడర్ ఆస రామారావు అన్నారు. శుక్రవారం రాయపోల్ మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో ఓటు హక్కు వినియోగం, పచ్చదనం పరిసరాల పరిశుభ్రత, ట్రాఫిక్ నియమాలు, డ్రగ్స్, సైబర్ నేరాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల పై పాట మాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ హైమావతి, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బిజ్జూరి రవి కుమార్ ఆదేశాల మేరకు రాయపోల్ మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో ఓటు హక్కు వినియోగం, పచ్చదనం పరిసరాల పరిశుభ్రత, డ్రగ్స్ నియంత్రణ, వర్షా కాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకునే జాగ్రత్తలు, ప్లాస్టిక్ నిషేధం, హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని వీటితోపాటు ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాల పైన ఆట-పాటలతో ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించడమైనది.
ప్రస్తుతం వర్షాకాలం కావడంతో వరుసగా కురుస్తున్న వర్షాలతో గ్రామాలలో పారిశుధ్యం అధ్వానంగా ఉందని ప్రజలందరూ ఎవరికి వారు స్వచ్ఛందంగా పారిశుద్ధ్యం పరిశుభ్రత కోసం సహకరించాలన్నారు. అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ అంశాలపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల బృందం చీకోడు నర్సింలు, బిట్ల ఎల్లం, తుమ్మల ఎల్లం, సందుర్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES