ప్రయివేటు వద్దు.. ప్రభుత్వ చదువే ముద్దు..
ప్రభుత్వ చదువుల కోసం ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు..
నవతెలంగాణ – మద్నూర్ : ప్రభుత్వ చదువు.. ప్రతిభకు మెరుగు .. ప్రయివేటు వద్దు.. ప్రభుత్వ చదువే ముద్దు అంటూ మన ఊరు మనబడి ప్రొఫెసర్ జయశంకర్ అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా శనివారం మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రభుత్వ చదువుల కోసం ఇంటింటా తిరుగుతూ పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల కోసం అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ చదువులతో రాబోయే కాలంలో పిల్లలకు భవిష్యత్తు ఉంటుందని, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అనుభవజ్ఞులైన క్వాలిఫై టీచర్లచే విద్య బోధన, ఉచిత పాఠ్యపుస్తకాలు, రెండు జతల యూనిఫామ్స్, ప్రతి ఒక్క విద్యార్థికి ఉచిత నోట్ బుక్స్ అందించడం జరుగుతుందని తెలిపారు. డిజిటల్ పరికరాల ద్వారా నాణ్యమైన విద్య బోధన, ప్రత్యేక తరగతులతో పాటు వ్యక్తిగత శ్రద్ధ, ఉచిత మధ్యాహ్న భోజనం, విద్యార్థులలో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలన కోసం వారానికి మూడు రోజులు గుడ్లు, మూడు రోజులు రాగి జావా అందించబడతాయని అన్నారు. ఈ విధమైన సౌకర్యాలతో ప్రభుత్వం అన్ని రకాల విద్యా బోధన అందిస్తుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు అడ్మిషన్లు చేయించాలని ఉపాధ్యాయులు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారంలో పాఠశాల ప్రధానోపాధ్యాయునితో పాటు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
మద్నూర్ లో ముమ్మరంగా సాగిన బడిబాట..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES