యూత్ కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ చత్రు నాయక్
నవతెలంగాణ – అచ్చంపేట: కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనుదీప్ గుప్తాపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని యూత్ కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ చత్రు నాయక్ శనివారం అచ్చంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏఐసీసీ యూత్ కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ రూపేష్ సింగ్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్ పిర్యాదు చేసినట్లు వెల్లడించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబంపై అవాకులు, చెవాకులు మాట్లాడితే సహించేది లేదన్నారు. రాహుల్ గాంధీకి దేశవ్యాప్తంగా వస్తున్న స్పందన చూసి ఓర్వలేక బీజేపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కుంద మల్లికార్జున్, మున్సిపల్ కౌన్సిలర్ గౌరీ శంకర్, యూత్ కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్, పవన్ , ఖాదర్, రఫీ, కృష్ణ, రాజగోపాల్, జబ్బు వెంకటేష్ ,బలరాం, శ్రీను నాయక్ , వినోద్, యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES