నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ లో పదవీ విరమణ వీడ్కోలు కార్యాక్రమం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. పదవీ విరమణ పోందిన వారికి శాలువలతో సత్కరించి సర్టిఫికేటు(జ్ఞాపికలతో) కమిషనర్ సాయి చైతన్య ఘనంగా సన్మానించారు. ఈ నేపథ్యంలోని జులై 31న సి. హెచ్. మురళిధర్ రాజు, ఎ.ఎస్.ఐ, వేల్పూర్ పోలీస్ స్టేషన్ శాఖలో 35సం.ల సర్వీసు పూర్తి చేసి పదవీ విరమణ పొందారు. ఎల్. నర్సింలు, ఎ.ఆర్.ఎస్.ఐ, పోలీస్ హెడ్ క్వార్టర్స్, నిజామాబాద్ పోలీస్ శాఖలో 41సం.ల సర్వీసు పూర్తి చేసి పదవీ విరమణ పొందారు. ఎస్. సత్యనారాయణ గౌడ్, ఎ.ఆర్.ఎస్.ఐ,పోలీస్ హెడ్ క్వార్టర్స్, నిజామాబాద్ పోలీస్ శాఖలో 35సం.ల సర్వీసు పూర్తి చేసి పదవీ విరమణ చేశారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో పని ఒత్తిడితో విధులు నిర్వహించి, ఎలాంటి రిమార్కు లేకుండా పదవీ విరమణ చేయడం గొప్ప విషయమన్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ తప్పక ఉంటుందని, డిపార్టుమెంటుకు చేసిన సేవలు ఎంతో ఘననీయమని కొనియాడారు. పదవీ విరమణ అనంతరము ఎలాంటి అవసరం వచ్చిన ఎల్లవేళల సహయపడుతామని తెలిపారు. కుటుంబ సభ్యులు అయురారోగ్యాలతో ఉండాలని, పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) బస్వారెడ్డి, రిజర్వు ఇన్స్పెక్టర్స్ శ్రీనివాస్, తిరుపతి, సతీష్, కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గోన్నారు.