Tuesday, June 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మేడారంలో ఘనంగా విత్తన పండుగ..

మేడారంలో ఘనంగా విత్తన పండుగ..

- Advertisement -

వనభోజనాలకు వెళ్లిన పూజారులు 
నవతెలంగాణ – తాడ్వాయి 
: మేడారంలో సమ్మక్క పూజారులు విత్తన పండుగ పూజా కార్యక్రమాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. మొదట కీర్తిశేషులు సిద్ధబోయిన లక్ష్మణరావు ఇంటి నుండి బయలుదేరి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రోహిణి కార్తె సందర్భంగా పూజారులు, స్థానిక ఆదివాసి కుటుంబాలు, వారి పిల్లలు గ్రామంలోని బొడ్రాయి వద్ద పసుపు కుంకుమ సమర్పించి పూజలు చేశారు. కూళ్లను యాటలను మొక్కుకున్నారు. డప్పు చప్పులతో మేడారం సమీపంలోని అడవిలో వన భోజనాలకు వెళ్లారు. వనంలో (అడవిలో) కొత్త పందిరి వేసి ప్రకృతి దైవాలకు పసుపు కుంకుమ కళ్ళు సారా సమర్పించి పూజలు చేశారు. ఈ సందర్భంగా పూజలు ఆదివాసీ పెద్దలు గ్రామస్తులు విత్తనాలు నాటేందుకు ముందుగా వర్షాలు ఏ కార్తిలో బాగా పడతాయని కొత్త మట్టికుండలో నీటిని పోసి ఒక్కొక్క కార్తి పేరు చెబుతూ విప్ప పూలను అందులో వేశారు. ఆ నీటిలో పూలు పైకి తేలితే వర్షాలు అనుకూలంగా పడతాయని, మునిగిపోతే వర్షాలు బాగా కురువవు అని గుర్తించడం ఆనవాయితీగా వస్తుందని ఆదివాసీలు వెల్లడించారు. పూజారులు పెద్దలు కలిసి ఎర్రగుడ్డలో ఇప్ప పూలతో, కొత్త కుండలో వేసి చూశారని తెలిపారు. అనంతరం పూజారులు ఆదివాసి కుటుంబాల వారు వనంలో వంట వార్పు చేసుకుని సకుటుంబ సమేతంగా భోజనాలను ఆరగించారు.ఈ కార్యక్రమంలో పూజాల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు మునీందర్, మల్లెల ముత్తయ్య, కొక్కర రమేష్, కొక్కెర కృష్ణయ్య, సిద్దబోయిన నితిన్, సిద్దబోయిన మహేష్, యూత్ అధ్యక్షులు బోజారావు, సిద్దబోయిన పాపారావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -