నవతెలంగాణ- మునుగోడు
రాజ్యాంగ ఫలాలు ప్రతి భారతీయుడికి అందిననాడే డాక్టర్ అంబేద్కర్ కు నిజమయిన నివాళి అని పెరుమాళ్ళ ప్రమోద్ కుమార్ అన్నారు. బుధవారం భారత రాజ్యంగ దినోత్సవ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యములో మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పెరుమాళ్ల ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. విభిన్న సంస్కృతులు , జాతులు , భాషలు ప్రాంతాలు కలిగిన భారతదేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని అందించి అనేక అసమానతలు రూపు మాపడానికి కృషి చేసిన గొప్ప దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. భారతదేశంలో ఎలాంటి వివక్షతకు తావులేకుండా అందరికీ అన్ని రంగాల్లో సమాన అవకాశాలు వస్తున్నాయి అంటే అది రాజ్యాంగం గొప్పతనమే అని అన్నారు.
అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైనా భారతదేశంలో మన రాజ్యాంగానికి ప్రత్యేక గుర్తింపు ఉంది.అందరిని సమానంగా చూడాలి,సమాన అవకాశాలివ్వాలి,ఎవరికయినా ప్రశ్నించే హక్కు ఉంటుందని, ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చి అధికారం పొందవచ్చని అన్నారు.కొన్ని కొన్ని దేశాల్లో రాజ్యాంగం ఆధారంగా,కొన్ని దేశాల్లో మతాల ఆధారంగా పాలించబడుతున్నాయి అన్నారు.ఈ కార్యక్రమములో పెరుమాళ్ల ప్రమోద్ కుమార్,గోలి రామదాసు, రెడ్డిమల్ల యాదగిరి, పెరుమాల్ల ప్రతాప్, బొల్లు సైదులు, నీరుడు సైదులు,బసనగర ముత్యాలు,గంగుల కృష్ణయ్య,గోలి శ్రీనివాస్,ముచ్చపోతుల శ్రావణ్, దుర్గాప్రసాద్,బసనగర రాము,అద్దంకి అంజయ్య, ముచ్చపోతుల పవన్ తదితరులు పాల్గొన్నారు.



