నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని ఇందిరా క్రాంతి పథకంలో కొన్నేళ్లుగా విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ మనోహరాబాద్ కు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో సత్యనారాయణ దంపతులకు కార్యాలయ సిబ్బంది, బందు మిత్రులు కలిసి ఏపీఎంను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇందిరా క్రాంతి పథకంలో మండలంలో పలు గ్రామ సంఘాలను బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేశారని, శ్రీనిధి లోన్లు, రికవరీ వసుళ్లు, కొత్త గ్రామ సంఘాలు , మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడానికి అహర్నిశలు కృషి చేస్తూ స్థానికంగానే కుటుంబ సభ్యులతో ఉంటూ మహిళల ఆర్థిక అభివృద్ధికి ఎంతో కృషి చేసినారని మిత్రులు కొనియాడారు . ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది , మిత్రులు తదితరులు పాల్గొన్నారు.
ఏపీఎంకు ఘన సన్మానం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES