‘ఎమర్జింగ్ టెక్నాలజీస్’పై సదస్సు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
‘ఎమర్జింగ్ టెక్నాలజీస్’ థీమ్తో కొనసాగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఓపెన్ డే మూడోరోజు వేలాదిమందితో కిటకిటలాడింది. శుక్రవారం ”రియల్ లైఫ్లో రిజిలియెన్స్” అనే అంశంపై ప్రారంభమైన ఈ సెషన్కు నగరంలోని పలు ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థులు హాజరై చర్చలో పాల్గొన్నారు. ఇందులో వేగంగా మారుతున్న టెక్నాలజీ ప్రపంచంలో రిజిలియెన్స్ ప్రాముఖ్యత, వ్యక్తిగత, వత్తిపరంగా ఎదురయ్యే ఒత్తిళ్లు, సవాళ్లను ఎదుర్కోవడం, కొత్త మార్పులకు త్వరగా అలవాటు పడే నాయకత్వ నైపుణ్యాలు, ఏఐ, ఎంఎల్ వంటి ఆధునిక సాంకేతికతల నేపథ్యంలో భవిష్యత్ సిద్ధత, యువతలో గ్రోత్-మైండ్సెట్, సమస్య పరిష్కార దృష్టికోణాన్ని అభివృద్ధి చేయడం తదితర అంశాలపై విస్తత స్థాయిలో చర్చ జరిగింది. ఈ సదస్సులో యూఐడీఏఐ మాజీ చైర్మెన్ జి. సత్యనారాయణ, మాస్టెక్ డిజిటల్ చీఫ్ డెలివరీ ఆఫీసర్ జితేంద్ర పుచ్చ, సీటీవో శ్రీనివాస్ అత్రేయ, క్విలిస్ సీఈవో అవికా కిషోర్ ఉప్పలపాటి పాల్గొన్నారు.
వేలాది మంది మధ్య జరిగిన ఈ చర్చలో విద్యార్థులు ఎంతో చురుకుగా ప్రశ్నలు అడిగారు. ప్యానెల్తో మమేకమయ్యారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏరోస్పెస్, మూసీ రివర్ డెవలప్మెంట్, హ్యాండీ క్రాఫ్ట్స్, టూరిజం, ఎడ్యుకేషన్, కరీంనగర్ ఇక్కత్, ఫిలిగ్రి, చేర్యాల పెయింటింగ్లు, సైబర్ క్రైమ్ ఛేదనలో ఉపయోగించే పలు ఆధునాతన పరికరాలు, డ్రోను, రోబో తదితర 27కు పైగా స్టాళ్లను సందర్శకులు అత్యంత ఆసక్తిగా తిలకించారు. ప్రధానంగా, ఆధునిక పరికరాలు, వైమానిక అంశాలను అడిగి తెలుసుకున్నారు. కాగా, శనివారం చివరి రోజు కావడంతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ గ్లోబల్ సదస్సును సందర్శించవచ్చని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో అగ్రికల్చర్, రూరల్ ట్రాన్స్ఫార్మేషన్ , ఫార్మర్స్ రైసింగ్ అనే అంశంపై సదస్సు జరుగుతుందని తెలిపారు. ఈకార్యక్రమానికి దాదాపు ఆరువేలకుపైగా హాజరు కాగా వీరిలో ఐదు వేల మంది విద్యార్థులు, వెయ్యి మంది సాధారణ ప్రజలు ఉన్నారు.
గ్లోబల్ సమ్మిట్ ఓపెన్డేకు భారీ సంఖ్యలో సందర్శకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



