Wednesday, October 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలువిద్యార్థులకు తృటిలో తప్పిన పెనుప్రమాదం

విద్యార్థులకు తృటిలో తప్పిన పెనుప్రమాదం

- Advertisement -

నవతెలంగాణ – జడ్చర్ల
ఆశ్రమ పాఠశాల బస్సు రోడ్డు పక్కకు ఒరిగి పోవడంతో విద్యార్థులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన జడ్చర్ల మండల పరిధిలోని కోడుగల్ లింగంపేట మధ్యలో చోటుచేసుకున్నది. జడ్చర్ల మండల పరిధిలోని లింగంపేట గ్రామంలో నదిని నజీనికేతన్ ఆశ్రమ పాఠశాల నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలకు కూడికల నుండి బస్సులో విద్యార్థులు హాజరై తిరుగు ప్రయాణంలో లింగంపేట నుండి కోడుగల్ కు మంగళవారం సాయంత్రం 30 మంది విద్యార్థులు బస్సులో బయలుదేరారు. ఈ క్రమంలో లింగంపేట కోడ్గల్ గ్రామ మధ్యలో బస్సు రోడ్డు పక్కకు ఒరిగి ఆగిపోయింది. దీంతో అటుగా వెళుతున్న వారితో పాటు బస్సు డ్రైవర్ అప్రమత్తమై వెంటనే విద్యార్థులను బస్సులో నుండి క్షేమంగా కిందకి దింపారు.

ఇందులో కొంతమంది విద్యార్థులకు స్వల్ప దెబ్బలు తగిలాయి. బాలానగర్ నుండి గంగాపూర్ వరకు రోడ్డు నిర్మాణం ఓ కాంట్రాక్టర్ చేపడుతున్నాడు. ఈ క్రమంలో గంగాపూర్ నుండి కోడుగల్ వరకు రోడ్డు నిర్మిస్తున్న కాంట్రాక్టర్ గ్రామాల మధ్య రాకపోకలకు మరో రహదారి నిర్మించలేదు. అంతేకాదు ఉన్న రోడ్డుకు మట్టి అడ్డంగా వేయడంతో పాటు గోతులున్నా కూడా పట్టించుకోకుండా నెలల తరబడి నిర్లక్ష్యంగా రోడ్డును అలానే వదిలేశారు. దీంతో ఈ రోడ్డుపై తరచుగా ప్రమాదాలు జరిగి, ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం కూడా ఆశ్రమ పాఠశాల విద్యార్థుల బస్సు రోడ్డు పక్కలోని గోతిలోకి ఒరిగిపోయి పెను ప్రమాదం నుంచి బయటపడింది.

ఈ క్రమంలో స్థానికులు మాట్లాడుతూ.. సంబంధిత రోడ్డు కాంట్రాక్టర్ ముందు తాత్కాలిక రోడ్డు వేసిన తర్వాతే, డబుల్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని తెలిపారు. లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళనా కార్యక్రమాలు చేపడతామని విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై అధికారులు విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -