- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండల పరిధిలోని గోసాన్ పల్లిలో తన కొడుకు దొందడి తిరుపతి రెడ్డి (ప్రస్తుత సర్పంచ్ అభ్యర్థి )ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ తల్లి దొందడి లక్ష్మి (తాజా మాజీ సర్పంచ్) ఇంటింటా తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. తాను చేసిన సేవలను తనయుడు చేస్తాడని.. గ్రామాన్ని మరింత అభివృద్ధి బాటలో నిలుపుతాడని వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకునేలా విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
- Advertisement -



