- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: 243 బీహార్ అసెంబ్లీ స్థానాలకు రేపు తొలి విడత పోలింగ్ జరగనుంది. ఈక్రమంలో తాజాగా సోదరులైన తేజ్ ప్రతాప్, తేజస్వి యాదవ్ అనుకోకుంటా పాట్నా ఎయిర్పోర్ట్లో ఎదురుపడ్డారు. కొంతసేపు దగ్గరగా ఉన్నప్పటికీ తేజ్ ప్రతాప్, తేజస్వి యాదవ్ మాట్లాడుకోలేదు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఆర్జేడీతో పాటు కుటుంబం నుంచి బహిష్కరణ తర్వాత జనశక్తి జనతాదళ్ పార్టీని తేజ్ ప్రతాప్ ఏర్పాటు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 22 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఆర్జేడీకి పట్టున్న రాఘోపూర్లో తమ్ముడు తేజస్విపై తన పార్టీ అభ్యర్థిని పోటీలో దించారు.
- Advertisement -



