- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్: మద్నూర్ గ్రామ శివారు పరిధిలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. దీంతో పరిసరా ప్రాంతాలు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయంపై నవతెలంగాణ ఫారెస్ట్ రేంజ్ అధికారి సుజాతను ఫోన్ ద్వారా వివరణ కోరగా.. చిరుత పులి సంచారంపై అక్కడి బీట్ అధికారి పరిశీలించారని తెలిపారు. చిరుత పులి పాదాల ఆనవాళ్లు గుర్తించలేనీ విధంగా ఉన్నాయనీ, ప్రజలు ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిరుత పులి సంచారం పైన ఫారెస్ట్ సిబ్బంది మరింతగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నిర్దారించుకుని తదుపరి సమాచారం వెల్లడిస్తామని ఆమె స్పష్టం చేశారు.
- Advertisement -