నవతెలంగాణ – కంఠేశ్వర్ : హైదరాబాద్ తెలంగాణ సారస్వత పరిషత్ లో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా తెలంగాణ జాగృతి నిర్వహించిన తెలంగాణ యువ కెరటాలు, యువకవి సమ్మేళనం కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న నిజామాబాద్ ప్రముఖుల్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఘనంగా సత్కరించారు. వ్యాఖ్యాతగా వ్యవహరించిన హరిదా రచయితల సంఘం అధ్యక్షులు ఘనపురం దేవేందర్, కీలక ప్రసంగం చేసిన తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నాళేశ్వరం శంకరం, ఆత్మీయ అతిథిగా హాజరైన కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత రమేశ్ కార్తీక్ నాయక్, తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం నిజామాబాద్ కన్వీనర్ తిరుమల శ్రీనివాస్ ఆర్యలు ఈ సత్కారం అందుకున్న వారిలో ఉన్నారు. తమ నిజామాబాద్ జిల్లా నుంచి సాహిత్య రంగంలో తమదైన శైలిలో దూసుకుపోతున్న వీరిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేకంగా అభినందించారు. ఈ చారిత్రాత్మక మహోత్సవంలో సత్కారం అందుకోవడం పట్ల కవులు ఆనందం వ్యక్తం చేశారు.
సాహితీవేత్తలకు జాగృతి సత్కారం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES