- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కరీంనగర్ నగర శివారులో ఉన్న ఓ ప్రయివేటు మెడికల్ కాలేజీలోని బాత్రూంలోకి బుర్ఖా వేసుకుని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు దూరారు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది వారిని పట్టుకొని బుర్ఖా తీయగా ఒకరు మగ, మరొకడు ఆడ మనిషిగా వెల్లడైంది. అయితే వీరిద్దరు దొంగతనానికి వచ్చారా? లేదా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేందుకు బాత్రూంలోకి దూరారా? అనేది తెలియాల్సి ఉంది. వీరిని సెక్యురిటీ సిబ్బంది పోలీసులకు అప్పగించారు.
- Advertisement -