- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడులోని తెన్కాశీ జిల్లా మీనాక్షిపురం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. రైతు జాన్సన్ తన మొక్కజొన్న పంటను పక్షులు, జంతువుల నుంచి రక్షించేందుకు ఆహార పదార్థాలలో ఎలుకల మందు కలిపి పెట్టాడు. ఈ దుష్పరిణామం కారణంగా అక్కడికి వచ్చిన సుమారు 50 నెమళ్లు ఆ ఆహారం తిని స్పాట్లోనే మృతి చెందాయి. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు, పోలీసుల సహకారంతో ఘటనా స్థలానికి చేరుకుని నెమళ్ల కళేబరాలను స్వాధీనం చేసుకున్నారు. రైతును అరెస్ట్ చేశారు.
- Advertisement -



