నవతెలంగాణ హైదరాబాద్: ఫార్ములా-ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేయడాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఖండించారు. ‘‘రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్ సర్కార్ మళ్లీ నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఎన్ని కుట్రలు పన్నినా మీ వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగడతాం’’ అని ఆమె పేర్కొన్నారు.
ఫార్ములా ఈ కేసులో ఈనెల 16న విచారణకు రావాలని ఏసీబీ మరోసారి కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. మే 26నే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని గతంలో ఏసీబీ నోటీసులు ఇచ్చింది. విదేశీ పర్యటన షెడ్యూల్ ఉందని.. తిరిగి వచ్చాక హాజరవుతానని కేటీఆర్ సమాధానం ఇచ్చారు. దీంతో తాజాగా 16న విచారణకు హాజరు కావాలని కేటీఆర్కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది.