- Advertisement -
- మహిళకు తీవ్ర గాయాలు
నవతెలంగాణ పెబ్బేరు
పెబ్బేరు ఆర్టీసీ బస్టాండ్ లో జరిగిన ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం నారాయణ పేటకు చెందిన కోటకొండ అంజమ్మ పెబ్బేరు ఆర్టీసీ బస్టాండ్ లో బస్సు దిగుతుండగా అదే బస్సు వెనక టైర్ కిందపడి రెండు కాళ్ళు నుజ్జునుజ్జు అయ్యాయి. తొటి ప్రయాణికులు ఆమెను అంబులెన్స్ లో వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
- Advertisement -


