- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని కాచాపూర్ గ్రామంలో సొసైటీ యూరియా గోదాములను ఏ డి ఏ అపర్ణ గురువారం తనిఖీ చేశారు. రైతులకు సొసైటీ పాస్ పుస్తకాలు తీసుకువస్తేనే యూరియా బ్యాగులు ఇవ్వాలని, రైతులకు వ్యవసాయానికి సరిపడా యూరియా బ్యాగులు సొసైటీ లో ఉన్నాయని ఆందోళన చెందకుండా అధికారులకు సహకరించాలన్నారు. ఈ తనిఖీలో ఏ డి ఏ వెంట ఏవో నరేంద్ర, ఏఈఓ ప్రియాంక, కార్యదర్శి మహేశ్వరి, సొసైటీ సిబ్బంది రేణుక, తదితరులు ఉన్నారు.
- Advertisement -



