- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హనుమకొండ కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా దొరికిపోయారు. హనుమకొండ జిల్లా ఇన్ఛార్జి డీఈవోగానూ వెంకట్రెడ్డి విధులు నిర్వర్తిస్తున్నారు. ఓ ప్రైవేట్ స్కూల్ రెన్యువల్కు లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. వెంకట్రెడ్డితోపాటు జూనియర్ అసిస్టెంట్ మనోజ్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
- Advertisement -



