నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు గొప్ప దేవయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర మున్నూరు కాపు సంఘం సభ్యత్వల స్వీకరణ చేపట్టారు. సిరిసిల్లలోని మున్నూరు కాపు సంఘం నేతలు రాష్ట్రమున్నూరు కాపు సంఘంలో సభ్యత్వాలు చేసుకున్నారు ఈ ప్రక్రియ కొంతకాలం మాత్రమే ఉంటుందని ప్రతి ఒక్కరు సభ్యత్వం చేసుకోవాలని మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు బొప్ప దేవయ్య అన్నారు. సభ్యత్వాల స్వీకరణ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దుమాల శ్రీకాంత్, పట్టణ అధ్యక్షులు అగ్గి రాములు, కల్లూరి రాజు, ఆకుల జయంత్ కుమార్, రాష్ట్ర కార్యదర్శులు కూర సురేష్, ఇప్పపూల దేవయ్య, ఎర్రం మల్లయ్య ,ఎర్రం ఆగయ్య, ఇప్పపూల రాజు, ఇప్పపూల లక్ష్మణ్, తోట శంకర్ తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర మున్నూరు కాపు సంఘం సభ్యత్వాల స్వీకరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES