Sunday, June 29, 2025
E-PAPER
Homeబీజినెస్జీడీపీకి వ్యవసాయం దన్ను

జీడీపీకి వ్యవసాయం దన్ను

- Advertisement -

2023-24లో 7 శాతం వృద్ధి
న్యూఢిల్లీ
: దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముఖగా ఉన్న వ్యవసాయ రంగం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి ప్రధాన మద్దతును అందించింది. ఆర్థిక సంవత్సరం 2023-24లో ఈ రంగం 7 శాతం వృద్ధితో రూ.29.49 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తిని నమోదు చేసిందని ప్రభుత్వ గణంకాలు తెలిపాయి. ఇంతక్రితం ఆర్థిక సంవత్సరం 2022-23లో రూ.27.56 లక్షల కోట్ల విలువను నమోదు చేసింది. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా రిపోర్ట్‌ ప్రకారం.. వ్యవ సాయం, పశుసంవర్ధకం, ఫిషరీస్‌, అటవీ రంగాల సమిష్టి ఫలితంగా ఈ వృద్ధి సాధ్యమయ్యింది.
విభాగాల వారీగా పరిశీలిస్తే వ్యవసాయ రంగం ఒక్కటే రూ.22.73 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తిని అందించింది. ఇది మొత్తం ఉత్పత్తిలో ప్రధాన భాగం. పశుసంవర్ధక రంగం రూ.4.12 లక్షల కోట్లు, ఫిషరీస్‌ రంగం రూ.1.62 లక్షల కోట్లు, అటవీ రంగం రూ.1.02 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తిని సమకూర్చాయి. ఈ రంగాలన్నీ కలిసి దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం కీలక పాత్రను మరోసారి నొక్కి చెప్పాయి. మొత్తం జిడిపిలో వ్యవసాయ రంగం వాటా 18 శాతంగా ఉంది. వ్యవసాయాన్ని చిన్న చూపు చూసే కేంద్ర ప్రభుత్వానికి ఈ గణంకాలు కనువిప్పు కావాలని నిపుణులు సూచిస్తున్నారు.
సవాళ్లు..
ఈ స్థాయిలో వృద్ధి ఉన్నప్పటికీ వ్యవసాయ రంగం ఇంకా అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని నివేదిక సూచించింది. వాతావరణ మార్పులు, అనియత వర్షపాతం, నీటి కొరత, మార్కెట్‌ ధరలలో హెచ్చు తగ్గులు రైతుల ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపుతు న్నాయి. ఎరువులు, విత్తనాలు, కీటక నాశినులు తదితర ఇన్‌పుట్‌ ఖర్చులు పెరగడం కూడా రైతులకు ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తోంది. ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు. రైతులకు మెరుగైన నీటిపారుదల సౌకర్యాలు, రుణ సౌలభ్యం కల్పించడం ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయవచ్చని భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -