బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో రూపొందిన చిత్రం ‘అఖండ 2: ది తాండవం’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఎం తేజస్విని నందమూరి సమర్పించారు. శుక్రవారం రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్తో, హౌస్ఫుల్ కలెక్షన్స్తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. నిర్మాతలు మాట్లాడుతూ,’కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా ఒక వారం రోజులు వాయిదా పడింది. ఈ సమస్యని పరిష్కరించడానికి మ్యాంగో మీడియా రామ్, నిర్మాత దిల్ రాజు చాలా సపోర్ట్ చేశారు. వారికి ధన్యవాదాలు. ఆలస్యం అయినప్పటికీ ఈనెల 12న ఈ సినిమా ప్రీమియర్స్తో రిలీజ్ అయింది.
ప్రీమియర్స్కి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. మేము భ్రమరాంభలో చూసాం. ఫ్యాన్స్ అసలు సీట్లో కూర్చోవడం లేదు. నిలుచుని చప్పట్లు, విజిల్స్తో అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. ఈరోజు మార్నింగ్ మ్యాట్నీ షోలు కూడా అద్భుతంగా ఉన్నాయి. అన్ని ఏరియాల నుంచి మంచి కలెక్షన్స్, రిపోర్ట్స్ వస్తున్నాయి. నార్త్లో జీ సినిమాస్ ద్వారా దాదాపు 800 స్క్రీన్స్లో రిలీజ్ చేశాం. అక్కడ ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారని రిపోర్ట్స్ వస్తున్నాయి. సినిమాకి వర్డ్ ఆఫ్ మౌత్ బ్రహ్మాండంగా ఉంది. సూపర్ ట్రెండ్ లో టికెట్స్ బుక్ అవుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ చేయాలని భావిస్తున్నాం’ అని తెలిపారు.
‘అఖండ 2’కు సూపర్ రెస్పాన్స్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



