నవతెలంగాణ – చిన్నకోడూరు
రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే హరీష్ రావు ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే అంత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి సమయంలో హరీష్ రావు నియోజకవర్గానికి చెందిన చిన్న కోడూరు మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన నూతనంగా ఎన్నికైన కుంభాల మణెమ్మ శేఖర్లు కలవడం మండలంలో హాట్ టాపిగా మారింది. బుధవారం మన్నెమ్మ తో పాటు వార్డు సభ్యులను తీసుకొని వంగ రాజేశ్వర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. వంగ రాజేశ్వర్ రెడ్డి వారిని మర్యాదపూర్వకంగా శాలువాతో సన్మానం చేశారు. మీ కష్టసుఖాల్లో ఎల్లవేళలా మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చినట్లు సర్పంచ్ మనమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు చానకొండ రాజు కొత్తకొండ మూర్తి అక్కి తిరుపతి రోజా తో పాటు కుంభాల శేఖర్ పిల్లి నరసింహులు బోయిని శిల్ప రుచిత్ రెడ్డి పరుశరాములు అజయ్లు పాల్గొన్నారు.
వంద రాజేశ్వర్ రెడ్డిని కలిసిన అల్లిపూర్ సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



