- Advertisement -
నవతెలంగాణ – గండీడ్
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలంలోని సాలార్ నగర్ ప్రాజెక్ట్ అలుగు పారుతోంది. గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వర్షపు నీరువచ్చి చేయడంతో ప్రాజెక్ట్ నిండి మంగళవారం అలుగు పారింది. దీంతో గ్రామస్తులు, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలుగు పారడంతో స్థానికులు, చిన్నవార్వాల్, పెద్దవార్వాల్, తదితర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు చూడటానికి తరలివచ్చారు. కాగా అడుగు పారుతుండటంతో మత్స్యకారులు చేపలు బయటికి వెళ్లకుండా జాలీలను ఏర్పాటు చేశారు. అలుగు ఉదృతంగా ప్రవహించడంతో చేపలు పట్టడానికి ఎవరు అలుగులోకి వెళ్లారాదని స్థానికులు తెలుపుతున్నారు.
- Advertisement -