నవతెలంగాణ – జడ్చర్ల
బాదేపల్లి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 31న పట్టణంలోని చంద్ర గార్డెన్ లో పూర్వ విద్యార్థుల సన్నాహక సమావేశం ఉంటుందని కమిటీ అధ్యక్షుడు రవిశంకర్ వెల్లడించారు. శనివారం హైస్కూల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబర్ 27 28 29 తేదీల్లో శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా నిర్వహించే సన్నాహక సమావేశానికి పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
శతాబ్ది ఉత్సవాలకు సంబంధించి ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి పూర్తి సహకారం అందిస్తున్నారని స్పష్టం చేశారు. 1925లో ప్రారంభమైన పాఠశాల దినదినాభివృద్ధి చెందుతూ ప్రస్తుతం మూడు భాషల్లో బోధన కొనసాగుతుందని తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న మూడవ పాఠశాలగా అభిప్రాయపడ్డారు. బడి రుణం తీర్చుకునేందుకు ప్రతి పూర్వ విద్యార్థి ఉత్సవాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. వేలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసించి ఉన్నత స్థానాల్లో ఉన్నారని దేశ విదేశాల్లోనూ పేరు ప్రఖ్యాతలు గాంచారని తెలిపారు.
అలాంటి హై స్కూల్ శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం అందులో భాగస్వామ్యం కావడం వరమన్నారు. ప్రధానోపాధ్యాయులు చంద్రకళ మాట్లాడుతూ శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేసుకుందామని అందుకు తమ పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించారు. సమావేశంలో శతాబ్ది ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి రమణాచార్యులు వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ, ఉపాధ్యక్షులు సయ్యద్ ఇబ్రహీం, గోపాల్, పెద్ద బాలకృష్ణ ఆకుల వెంకటేష్ జీనురాల సత్యం, టైటాన్స్ సత్యం, శ్రీనివాస్ చారి, జయప్రకాష్, ప్రకాష్, సంతోష్ చారి, కార్యనిర్వహణ కార్యదర్శి కంచుకోట ఆనంద్, రాఘవేందర్ గౌడ్, ఉపాధ్యాయులు సునీల్ పాల్గొన్నారు.
ఆగస్టు 31న పూర్వ విద్యార్థుల సన్నాహాక సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES