నవతెలంగాణ – తాడ్వాయి : మండల కేంద్రంలోని తాడ్వాయి ఆశ్రమ హైస్కూల్లో(ఏహెచ్ఎస్) ఆదివారం 1988- 89 లో చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం వైభవంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులు కలుసుకొని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అప్పటి ఉపాధ్యాయులను సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంతంత మాత్రమే సదుపాయాలు ఉన్న నాటి రోజుల్లో చదువుకున్న విద్యార్థులు నేడు ఉన్నత స్థాయిలో ఉండటం తమకు గర్వకారణంగా ఉందన్నారు. 37 ఏళ్ళ తరువాత కూడా తమను గుర్తుంచుకొని సత్కరించడం ఎంతో సంతోషం కలిగిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఆనాటి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు తల్లడి లక్ష్మయ్య, కోగిల సారయ్య, కొమరం రామారావు, సరోజన, లక్ష్మణరావు, పమిడయ్య, గుమ్మడి ముత్తయ్య, రేగ నరేందర్ కుమార్, మీనా కుమారి, గంట కృష్ణారెడ్డి, రమేష్, బుర్ర రవి, ఎర్రం స్వామి, వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, ప్రేమ కళ, స్వరూప, చంద్రకళ మరియు 30 మంది పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES