నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం నేలపట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. 1994-95 పదవ తరగతి పూర్వ విద్యార్థులు పాఠశాలను సందర్శించి పాఠశాల ఆవరణలో సరస్వతి దేవి విగ్రహానికి పూలమాలతో ఘనంగా అలంకరించారు. సీనియర్ ఉపాధ్యాయులు రమణమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు మంచి సత్ప్రవర్తనతో సమాజంలో ఎదగాలని సూచించారు.పూర్వ విద్యార్థులు పాఠశాలను కలియ తిరుగుతూ గతంలో గడిపిన క్షణాలను ఒకరిని ఒకరు గుర్తు చేసుకున్నారు.అనంతరం ఉపాధ్యాయులను శాలువా మెమొంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్ కృపాకర్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అవ్వారు గోవర్ధన్ భారతి పూర్వ విద్యార్థులు పల్లె కృష్ణయ్య తిరం దాసు వెంకటేష్ పల్లె రాజు పోలోజు బ్రహ్మచారి డి.రాములు చిందం బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES