- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి
పత్తి క్వింటాళుకు రూ.8110 మద్దత ధర ప్రభుత్వం కల్పించిందని..రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏఎంసీ చైర్మన్ పులి క్రిష్ణ తెలిపారు. సోమవారం మండల పరిధిలోని ముత్తన్నపేట గ్రామ శివారులో ఓ ప్రయివేట్ మిల్లు యందు ఏర్పాటుచేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ చైర్మన్ పులి క్రిష్ణ ఏఓ సంతోశ్,ఏఎంసీ డైరెక్టర్లతో కలిసి ప్రారంభించారు. ఏఎంసీ కార్యదర్శి వెంకటయ్య,వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,ఆలయ చైర్మన్ జెల్ల ప్రభాకర్,నాయకులు కత్తి రమేశ్,సంధీప్,శ్యామ్,రాజు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



