- Advertisement -
నవతెలంగాణ తుర్కపల్లి
మండలం మాదాపూర్ సెక్టార్ ములకలపల్లి గ్రామంలో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ నజీమోనిస ఆధ్వర్యంలో ప్రీస్కూల్ తల్లులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడి స్కూళ్లకు వచ్చే పిల్లలకు ఆటపాటలతో కూడిన విద్య వర్క్స్ బుక్స్ రాయించడం జరుగుతుందని, తల్లులకు అవగాహన కల్పించారు. ప్రతి బుధవారం పిల్లలకు ఎగ్ బిర్యానీ పెట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ వి। సులోచన, ఏఎన్ఎం సంధ్యారాణి, ఆయా కె మాధవి, గర్భిణీలు, బలంతలు, తల్లులు, విద్యార్థులు పాల్గొన్నారు
- Advertisement -