- Advertisement -
వతెలంగాణ -ముధోల్
మండలంలోని ఆయా గ్రామాలలో ఈ నెల 3వ తేదీ నుంచి రెవెన్యు సదస్సులు కొనసాగుతున్నాయి. అయితే గురువారం మండలంలోని ముద్గల్, వడ్తల్ గ్రామాలలో రెవెన్యూ సదస్సులు జరిగాయి. దీంతో గ్రామాల్లోని రైతులు తమ సమస్యలను పరిష్కారం కై దరఖాస్తులు రెవెన్యూ అదికారులకు అందజేశారు. ముద్గల్ గ్రామంలో 46 దరఖాస్తులు రాగ వడ్తల్ గ్రామంలో 69 దరఖాస్తులు వచ్చినట్లు రెవెన్యూ తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ కే శ్రీలత ఆర్ఐ నారాయణ పటేల్, సరస్వతి వీఆర్ఏలు ,రికార్డ్ అసిస్టెంట్లు,రైతులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -