నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీలో అనలాగ్ ఐఏఎస్ అకాడమీ వారు నిర్వహిస్తున్న ప్రత్యేక కోచింగ్ సెంటర్ ను తెలంగాణ యూనివర్సిటీ బిఆర్ఎస్వి అధ్యక్షుడు శ్రీను రాథోడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగుల కోసం ప్రిపేర్ అవుతున్న యూనివర్సిటీ విద్యార్థులకు అనలాగ్ ఐఏఎస్ అకాడమీ వాళ్లు హైదరాబాద్లో ప్రత్యేక కోచింగ్ నిర్వహిస్తున్నారని వివరించారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అంతకు ముందు పోస్టర్లను ఆవిష్కరించారు.
త్వరలో టీజీపీఎస్సీ గ్రూప్ సంబంధించిన కోచింగ్ సెంటర్లో తెలంగాణ రాష్ట్రం మంచి అకాడమి కి మంచి పేరు ఉందని, మీరందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ విద్యార్థులు రాము, సచిన్, శివరాం , రాకేష్ తదితరులు పాల్గొన్నారు.