- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్ ఆధ్వర్యంలో మన ఊరు మన బడి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా శనివారం విద్యార్థుల తల్లిదండ్రులకు పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపాలని కోరారు. ప్రయివేట్ చదువులకంటే ప్రభుత్వ చదువులు బాగుంటాయని, పిల్లలకు అన్ని రకాలుగా ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, రెండు జతల యూనిఫామ్ అదేవిధంగా క్వాలిఫై టీచర్లతో విద్యాబోధన ఉంటుందని వెల్లడించారు. పిల్లల భవిష్యత్తు ప్రభుత్వ పాఠశాలల చదువులతో ఎంతో ఉపయోగకరమని పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
- Advertisement -