Tuesday, June 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం..

ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  : బస్వాపురం రిజర్వాయర్లో ముంపుకు గురవుతున్న బి ఎన్ తిమ్మాపురం గ్రామస్తులకు నష్టపరిహారం విడుదల చేయించినందుకు గాను కృతజ్ఞతలు తెలుపుతూ..మాజీ ఎంపీటీసీ జిన్న  మల్లేష్ ఆధ్వర్యంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి  చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే నష్టపరిహారం విషయంపై చర్చించినప్పుడు తక్షణమే స్పందించి నిధులు విడుదల  చేసినందుకుగాను పాలాభిషేకం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో  మాజీ సర్పంచ్ రావుల నందు,  గ్రామశాఖ అధ్యక్షుడు పిన్నెం శ్రీశైలం, వర్కింక్ ప్రెసిడెంట్ అన్నేపు గణేష్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగదేవి బాల్ రాజ్, తోటకురి రమేష్, ఉడత అశోక్,  జిన్నా నర్సింహ, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -