- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయ గోశాలలో కోడెల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సందీప్ అధికారులను ఆదేశించారు. ఆలయంలో 1,250కి పైగా కోడెలు ఉండగా నేటి నుంచి 300 కోడెలను రైతులకు పంపిణీ చేస్తామని ప్రకటించారు. https://rajannasircilla.telangana.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. కాగా గోశాలలో కోడెల మరణాలు కలకలం రేపుతున్నాయి. 3 రోజుల్లోనే 18 కోడెలు మృత్యువాతపడినట్లు సమాచారం.
- Advertisement -