– ప్రిన్సిపాల్ ఎన్.గోపి
నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలు చేసేందుకుగాను అతిథి అధ్యాపకుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.గోపి శనివారం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కళాశాలల కమిషనర్ ఆదేశాలు మేరకు 2025 – 26 విద్యా సంవత్సరానికి గాను ఖాళీగా ఉన్న పొలిటికల్ సైన్స్ (01),కామర్స్ (01), ఎకానమిక్స్(01), హిస్టరీ (01)కెమిస్ట్రీ (01)బోటనీ (01)విభాగాలలో అతిథి అధ్యాపకుల నియామకాలు ఈ నెల 11 వ తేది గురువారం ఉదయం 10 గంటల నుంచి కొత్తగూడెం లోని శ్రీ రామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో ఇంటర్వ్యూ ద్వారా నిర్వహించబడతాయి అని తెలియజేశారు.
అభ్యర్ధులు సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 50% మార్కులు ఉండాలని అన్నారు.నెట్/సెట్/Ph.D కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడును. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 9 వ తేదీ మంగళవారం సాయంత్రం నాలుగు గంటల లోపు తమ పూర్తి బయోడేటా తో పాటు జత చేసిన సర్టిఫికెట్స్, అప్లికేషన్ ను సత్తుపల్లి జే వి ఆర్ ప్రభుత్వ కళాశాల నందు సమర్పించాలని తెలిపారు.