- Advertisement -
హైదరాబాద్ : ప్రీమియర్ ప్రయివేటు సేఫ్ డిపాజిట్ లాకర్ల సంస్థ అయిన ఆరమ్ హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించినట్లు తెలిపింది. 24 గంటలూ అందుబాటులో ఉండే టెక్ ఎనేబుల్డ్ బ్యాంకు లాకర్ సేవలను నగరంలోని సత్వ మాగస్, అపర్ణ సరోవర్ గ్రాండ్లలో అమర్చామని ఆరమ్ సిఇఒ, ఫౌండర్ విజయ్ అరిశెట్టి తెలిపారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బెంగళూరు, విశాఖ తర్వాత హైదరాబాద్ మార్కెట్లోకి ప్రవేశించామన్నారు. 2026 నాటికి 50 ప్రీమియం కమ్యూనిటీలు, 10వేల లాకర్లు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
- Advertisement -