నవతెలంగాణ – గోవిందరావుపేట
స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు స్థానిక ఎంపీడీవో చిలువేరు వరుణ్ కుమార్ తెలిపారు. బుధవారం వరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ 123 పోలింగ్ స్టేషన్లో గురువారం ఎన్నిక జరగనున్నట్లు తెలిపారు. మండల వ్యాప్తంగా 13 సర్పంచ్ స్థానాలకు మరియు 123 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. ఐదుగురు రూట్ ఆఫీసర్లు ఐదుగురు జోనల్ ఆఫీసర్లు 485 మంది పోలింగ్ సిబ్బందితో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందన్నారు.
ఉదయం 7 గంటల నుండి ఒంటిగంట వరకు పోలింగ్ జరుగుతుందని లంచ్ చేసిన తర్వాత రెండు గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అయి సాయంత్రానికి ఫలితాలు వెలువడతాయని అన్నారు పూర్తి చేసి అధికారులు పూర్తి సమాచారం అందిస్తారని అన్నారు. 18 పంచాయతీల పరిధిలో ఇప్పటికే ఐదు పంచాయతీలు సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగిందని అదేవిధంగా 1504 వార్డులకు కాను 123 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు.



