- Advertisement -
- – నేనున్నానంటున్న బుసిరెడ్డి పాండన్న
నవతెలంగాణ-పెద్దవూర
నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్న బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండురంగారెడ్డి అంత్యక్రియలు అనంతరం ఆత్మబంధు కార్యక్రమంలో భాగంగా భోజనాలు పంపిస్తున్నారు. మన రైతుబిడ్డ బుసిరెడ్డి పాండురంగారెడ్డి.ప్రతి ఒక్క నిరుపేదకు వెన్నుదన్నుగా నిలుస్తూ నాగార్జునసాగర్ నియోజకవర్గ ఆపద్భాందవుడిలా అందరిని ఆదు కుంటున్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని గుర్రంపూడు మండల కేంద్రం లోని ముడుసు లక్ష్మమ్మ,నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామానికి చెందిన మాతంగి గురవయ్య, గుర్రంపోడు మండలం, మైలాపురం గ్రామం ఒర్సు ఈదయ్య మృతి చెందారని తెలుసుకొని వారి కుటుంబాలకి అండగా ఒక్కొక్క కుటుంబానికి 100 చొప్పున భోజనాలు సొంత ఖర్చులతో పంపించారు. సహాయం కోసం టోల్ ఫ్రీ 9581742356, 7799585859 నంబర్లను సంప్రదించాలి. అందరిని ఆదరిద్దాం అనే సదుద్దేశంతో ఈ ఆత్మబంధు కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -