మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ భారతి ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘స్కై’. పృధ్వీ పెరిచర్ల దర్శకత్వం వహిస్తున్నారు. వేలార్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృధ్వీ పెరిచర్ల నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో శివ ప్రసాద్ అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ పరిశ్రమకు పరిచయమవుతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 6న రిలీజ్కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నిను కసిరిన సమయాన…’ అనే లిరికల్ సాంగ్ను రిలీజ్ చేశారు. ఈ పాటకు పృథ్వీ పెరిచెర్ల మంచి లిరిక్స్ రాయగా, వైష్ణవి ఆకట్టుకునేలా పాడారు. శివప్రసాద్ బ్యూటీఫుల్ ట్యూన్తో కంపోజ్ చేశారు. ‘నిను కసిరిన సమయాన, నను మరచిన నా హృదయం, అడుగడుగున నిను వెతికి, అణువణువున నిను తలచి, ఆలోచనంతా నీ వెనకే, ఆరాధనంతా నీ కొరకే..’ అంటూ లవ్ ఫీల్తో ఆకట్టుకుంటోందీ పాట.
ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన ‘తపనే తెలుపగ..’, ‘పోయేకాలం నీకు..’, ‘నిన్ను చూసిన..’ సాంగ్స్ చాట్బస్టర్స్గా మారి మిలియన్ వ్యూస్ రీచ్ అయ్యాయి. ఈ సాంగ్ కూడా మ్యూజిక్ లవర్స్ ఆదరణ పొందుతుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. పాటల మాదిరిగానే సినిమా కూడా ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తుందని భావిస్తున్నారు. రాకేశ్ మాస్టర్, ఎంఎస్, కేఎల్ కే మణి బమ్మ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – పృథ్వీ పెరిచెర్ల, డీవోపీ – రసూల్ ఎల్లోర్, ఎడిటర్ – సురేష్ ఆర్స్, డైలాగ్స్, స్టోరీ – పృథ్వీ పెరిచెర్ల, మురళీ కృష్ణంరాజు, మ్యూజిక్ – శివ ప్రసాద్, లిరిక్స్ – పృథ్వీ పెరిచెర్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – స్వాతి పెన్మెత్స, లిఖిత గుంటక.
‘నిను కసిరిన సమయాన..’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



