- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
వరంగల్ డిప్యూటీ కమిషనర్ జి.అంజన్ రావు,ప్రొబేషన్ వి. శ్రీనివాస్ ఆదేశాల మేరకు ప్రోహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని దుబ్బపేట,అడ్వాలపల్లి, గాదాంపల్లి గ్రామాల్లో నాటు సారాయి తయారీ స్థావారాలపై దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో వారిపై 3 కేసులు నమోదు చేసి,15 లీటర్ల నాటు సారాయి, 20 కేజీల చక్కరను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం 700 లీటర్ల చక్కర పాకాన్ని ధ్వంసం చేసినట్టు తెలిపారు. నాటు సారాయి తయారు చేసిన, కలిగి వున్నా, రవాణా చేసినా, అమ్మినా చట్ట రీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎక్సజ్ ఇన్స్పెక్టర్ కిష్టయ్య,కాన్స్టేబుల్ రాంచందర్,వెంకటరాజు,విమల పాల్గొన్నారు.
- Advertisement -


