- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఈనెల పదో తేదీన హైదరాబాద్లోని రవీంద్రభారతి మినీహాల్లో ప్రముఖ సాహితీవేత్తల నిర్వహణలో పురస్కారాల సభ జరగనుంది. ఈ మేరకు ఫౌండేషన్ చైర్మెన్ పి విజయేందర్రావు, పురస్కార కమిటీ కన్వీనర్ కాంచనపల్లి గోవర్ధన్ రాజు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఫీచర సునీతారావు పురస్కారాలను 2021లో ప్రారంభం చేశామని తెలిపారు. ఇప్పటి వరకు నాలుగేండ్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఈ ఏడాది ఫీచన సునీతరావు పురస్కారాల్లో విజేతలుగా కవిత్వంలో తండా హరీశ్గౌడ్, కథల్లో పిన్నంశెట్టి కిషన్, జెండా సుబ్బారావు, విమర్శలో ఎం దేవేంద్ర ఎంపికయ్యారని వివరించారు. వారికి ఈనెల పదో తేదీన పురస్కారాల ప్రదానం జరుగుతుందని తెలిపారు.
- Advertisement -