- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండలంలోని జప్తి జానకంపల్లి గ్రామంలో గల ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థినీలకు సోమవారం రోజు ఎల్లారెడ్డి షీ టీం ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ ఫై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిటీ కానిస్టేబుల్ సుప్రజ, శ్రీశైలం సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా రోడ్డు భద్రత, ఈవ్ టీచింగ్, బాల కార్మికుల వ్యవస్థ, గుడ్ టచ్,బ్యాడ్ టచ్ తదితర అంశాలపై విద్యార్థినిలకు అవగాహన కల్పించారు. విద్యార్థినిలు ఏదైనా ఇబ్బంది కలిగితే షీ టీం నెంబర్ కాల్ చేయాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- Advertisement -