- Advertisement -
నవతెలంగాణ – ముధోల్
మండలంలోని ముద్గల్ గ్రామంలో బుధవారం జాతీయవిపత్తుప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) ప్రకృతి వైపరీత్యాలు, ఇతర విపత్తుల గురించి ప్రజలకు బుధవారం అవగాహన కల్పించారు. ప్రమాదవశాత్తు నీళ్లలో పడి కొట్టుకపోతే ఎలా కాపాడాలి ,అగ్ని ప్రమాదం జరిగితే ఎలా , పాముకాటు గురైతే ఏం చేయాలి తదితర విపత్తుల గురించి బయటపడేందుకు ప్రజలకు క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కమాండర్ వినిత్ కుమార్, ఎంపిడిఓ శివకుమార్,ఆర్ ఐ నారాయణ పటేల్, కానిస్టేబుల్ సుభాష్, షిటీమ్ సిబ్బంది , ఎన్ డిఆర్ఎఫ్ బృందం, గ్రామస్తులు ,తదితరులు, పాల్గొన్నారు.
- Advertisement -