- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి
విద్యాహక్కుల చట్టం బాలల హక్కులు బాల కార్మిక నిర్మూల చట్టం మత్తుపార్థాల వాడక నిషేధం వాటి వలన దుష్పాలతో పాటు సామాజిక రుగ్మతలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మీ మాధవి లత తెలిపారు. బుధవారం స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పాఠశాలలో వసతుల కొరత ఉందని తెలిపి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ వివిధ చట్టాలపై రూపొందించిన షార్ట్ ఫిలిమ్స్ చూపించారు . ఈ కార్యక్రమములో పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యులు ఆర్. వెంకన్న మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -